పవన్’పై ఎన్టీఆర్ పంచులు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పొలిటికల్ గా టార్గెట్ చేయనున్నాడా ? ఆయన తాజా ‘జై లవ కుశ’ సినిమాలో పవన్ పై పొలిటికల్ సటైర్లు వేయనున్నాడా.. ?? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఎన్ టీఆర్ జై లవ కుశ దసరా కానుకగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసింది.

సెన్సార్ రివ్యూ ప్రకారంలో సినిమాలోని జై పాత్ర ఏపీ పొలిటిక్స్ పై సటైర్లు వేయనుందట. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి సపోర్టు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా పంచులుంటాయని చెప్పుకొంటున్నారు.

అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చిత్రబృందం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు బాబీ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్. ఇప్పటికే పవన్ తో సర్థార్ గబ్బర్ సింగ్ సినిమా తీశాడు. ఈ నేపథ్యంలో జై లవ కుశలో పవన్ పై ఎన్ టీఆర్ పంచులేయనున్నాడన్న న్యూస్.. లో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు.