క్లైమాక్స్ అమ‌రావ‌తిలో..

చంద్ర‌బాబుతో టీటీడీపీ నేత‌ల స‌మావేశం అసంపూర్తిగానే ముగిసింది. రేవంత్ పై పార్టీ అధినేత ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌నే విష‌యంలో ఇంకా క్లారిటీ రాలేదు. విదేశాల నుంచి హైద‌రాబాద్ లో టీటీడీపీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. గ‌త కొంత కాలంగా తెలంగాణ టీడీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు, ప‌రిస్థితుల‌ను నేత‌లు చంద్ర‌బాబుకు వివ‌రించారు. రేవంత్ కాంగ్రెస్ లో చేర‌తార‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో పార్టీలో నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం జ‌రుగుతున్న తీరుపై ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఏదైనా ఉంటే పార్టీ నేత‌లు స‌మావేశ‌మై నిర్ణ‌యం తీసుకోవాలి త‌ప్ప బాహాటంగా విమ‌ర్శ‌లు చేసుకోవ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది.

స‌మావేశంలో టీటీడీపీ నేత‌లు చెప్పిన వివ‌రాలు విన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు రేవంత్ అంశంపై మాత్రం ఎలాంటి నిర్ణ‌యం వెల్ల‌డించ‌లేదు. రేవంత్ ఎపిసోడ్ ను మాత్రం ఇంకా పెండింగ్ లో పెట్టారు. మ‌రో మారు శ‌నివారం అమ‌రావ‌తిలో స‌మావేశం కావాల‌ని ఆయ‌న నిర్ణ‌యించార‌ట‌. ఇందుకోసం టీటీడీపీ నేత‌లంతా అమ‌రావ‌తికి రావాల‌ని చెప్పార‌ట‌. ఎవ‌రూ తొంద‌ర‌ప‌డి మాట్లాడ‌వ‌ద్ద‌ని, స‌మావేశంలో చ‌ర్చించిన విష‌యాల‌పై గోప్య‌త పాటించాల‌ని నేత‌ల‌కు సూచించార‌ట‌. ఫైన‌ల్ గా రేవంత్ పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో , అస‌లు క్లైమాక్స్ ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే అమ‌రావ‌తిలో స‌మావేశం ముగిసే వ‌ర‌కు ఆగాల్సిందే..