రోబో ‘2.0’లో కేవలం మూడు పాటలే.. !

దర్శకుడు శంకర్ సంగీత ప్రియులకు నిరాశే మిగిల్చారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రోబో ‘2.0’. ఈరోజు దుబాయ్’లో ఈ సినిమా ఆడియో వేడుకని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. అయితే, ఈ సినిమా నుంచి ఐదు లేదా ఆరు పాటలని ఆశించడం.. ఆశాభంగమే అవుతోంది. ఎందుకంటే ? ఈ సినిమాలో కేవలం మూడు పాటలే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులని దృష్టిలోపెట్టుకొని ‘2.0’ తెరకెక్కించాడు దర్శకుడు. అందువలనఏ సినిమాలో తక్కువ పాటలని పెట్టినట్టు తెలుస్తోంది.

ఆడియో వేడుకకు ఒకరోజు ముందే చిత్రబృందం మీడియాతో సమావేశమయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు శంకర్ ‘2.0’ భారతీయ సినిమా. ఇది ఓ తమిళ్, ఓ తెలుగు సినిమా కాదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. ఇది రోబో సినిమాకి సీక్వెల్ కాదు. ‘2.0’ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా అని తెలిపారు.

‘2.0’ సినిమాలోని మూడు పాటలలో ఇంకా రెండు మాత్రమే తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆడియో వేడికపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ కంపోజ్ చేయబోయే సాంగ్ తెలిసిపోయింది. ఈ ఆడియో వేడుక తెలుగు వర్షన్ కి రానా దగ్గుపాటి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించనున్నారు. హీరోయిన్ అమీ జాక్సన్. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.