రేవంత్ దారిలో..

టీటీడీపీకి రేవంత్ గుడ్ బై చెప్ప‌డంతో అతిని మ‌ద్ద‌తుదారులు త‌మ దారి ఎటో తేల్చుకునే ప‌నిలో ప‌డ్డారు. త‌న‌తో వ‌చ్చే వారు 30న జ‌ల‌విహార్ కు రావాల‌ని ఆయ‌న పిలుపునివ్వ‌డంతో ఒక్కొక్క‌రుగా రేవంత్ దారిలో వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో టీటీడీపీ నేత‌లు ఆత్మీయ స‌మావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పార్టీ మార్పు, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు.

రేవంత్ కు చెందిన వ‌ర్గం జిల్లాల్లో స‌మావేశ‌మై ఆయ‌న వెంట న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే టీటీడీపీ బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి రాజారామ్ యాద‌వ్ పార్టీకి రాజీనామా చేయ‌గా, న‌ల్గొండ ,సూర్య‌పేట జిల్లాల్లోని నేత‌లూ అత్య‌వ‌స‌ర స‌మావేశాలు ఏర్పాటు చేసుకున్నారు.టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యురాలు ఉమా మాధ‌వ‌రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తం మీద పార్టీలో చాలామంది రేవంత్ వెంట న‌డిచేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.