ముహూర్తం 31న‌

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే ప్ర‌క్రియ వేగంగా జ‌రిగిపోతోంది. అమ‌రావ‌తి నుంచి నేరుగా కొడంగ‌ల్ వెళ్లిన రేవంత్ క్యాడ‌ర్ తో స‌మావేశ‌మ‌య్యారు. తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా కాంగ్రెస్ లో చేరితేనే బెట‌ర్ అనే అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే త‌న‌తో వ‌చ్చే వారు ఈ నెల 30వ తేదీన జ‌ల‌విహార్ కు రావాల‌ని పిలుపునిచ్చారు. ఎవ‌రెవ‌రు రేవంత్ వెంట వెళ‌తార‌నేది కూడా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రేపు సాయంత్రం త‌న అనుచ‌రుల‌తో నేరుగా ఢిల్లీ వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఈ నెల 31న ఢిల్లీలో రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ లో చేర‌డంతో పాటు ఎన్నిక‌ల్లో త‌న అనుచ‌రుల సీట్ల విష‌యంలో కూడా క్లారిటీ తెచ్చుకోవాల‌ని, ఒక స్ప‌ష్ట‌మైన హామీని తీసుకుని తిరిగి హైద‌రాబాద్ వ‌స్తార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. హైద‌రాబాద్ వ‌చ్చిన త‌రువాత త‌న కార్యాచర‌ణ ప్ర‌క‌టిస్తార‌ని భావిస్తున్నారు.