పవన్’ని ఊరిస్తున్న రూ. 40కోట్లు.. !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ని రూ. 40కోట్ల ఆఫర్ ఊరిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తన 25వ సినిమా “అజ్ఝాతవాసి” షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ పూర్తి స్థాయిలో పాలిటిక్స్ పై ఫోకస్ చేయాలని నిర్ణయించుకొన్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే జనసేన ఆఫీసుకు మెరుగులు దిద్దే పనులు కూడా ముగిశాయి. పార్టీ కార్యకలాపాల కోసం సిబ్బంది నియామకం కూడా జరిగింది.

ఇలాంటి సమయంలో మైత్రీ మూవీస్ బ్యానర్ పవన్’కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు చెప్పుకొంటున్నారు. తమ బ్యానర్ లో ఓ సినిమా చేస్తే పవన్ కి పారితోషికంగా రూ. 40కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారట. పవన్ కే రూ. 40కోట్లు ఇస్తే సినిమా ఎలా తీస్తారు ? అనే డౌటు కలగడం సహజం. అయితే, మైత్రీ మూవీస్ పక్కా ప్లాన్ తో ఉంది. పవన్’కు రెమ్యూనరేషన్ గా రూ. 40కోట్లు ఇచ్చి.. మరో రూ. 40కోట్లలో సినిమా తీయనున్నారు. ఆ సినిమాని సరిగ్గా వచ్చే సాధారణ ఎన్నికల సమయంలో రిలీజ్ చేసి సొమ్ము చేసుకోవాలని పక్కా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ ఆఫర్ కు పవన్ ఓకే చెబుతాడా ? లేదా.. ?? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ పైసలకు లొంగే రకం కాదు. కథ నచ్చి, ఆ సినిమాలో నటించే సమయం ఉంటే మాత్రం మైత్రీ మూవీస్ ఓకే చెప్పే ఛాన్స్ ఉంది. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో యేడాదిన్నర మాత్రమే ఉండటంతో పవన్ మైత్రీ మూవీస్ ఇచ్చిన భారీ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించా అవకాశాలే ఎక్కువని చెప్పుకొంటున్నారు.