బ్రేకింగ్ : జూబ్లీహీల్స్’లో భూకంపం

హైదరాబాద్ జూబ్లిహిల్స్’లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.ఈ ఉదయం 8.30నిమిషాలకు కేబీఆర్ పార్క్, దుర్గం చెరువు, పెద్దమ్మగుడి ప్రాంతాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 0.5గా నమోదైనట్టు ఎన్జీఆర్ఐ అధికారులు తెలిపారు.

అయితే, ఇది తీవ్రమైనది కాదు. దీని వల్ల భయపడాల్సిన అవసరం లేదని ఎన్జీఆర్ఐ అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం కేబీఆర్ పార్క్ లో ఉన్నట్టు గుర్తించారు. ఇళ్లలో ఉన్నవారు ఈ ప్రకంపనలను గుర్తించి, భయాందోళనలతో ఇళ్లలోంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో భూప్రకంపనలు రావడం చాలా అరుదు. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ లో నగరంలో భూ ప్రకంపనలు రావడం గమనార్హం.