మంత్రి త‌ల‌సాని నియోజ‌క‌వ‌ర్గంలో దారుణం

హైద‌రాబాద్ న‌డిబొడ్డున దారుణం జ‌రిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ నేత‌పై దుండగులు విరుచుకు ప‌డ్డారు. స‌న‌త్ న‌గ‌ర్ బ‌స్టాప్ వ‌ద్ద స్థానిక టీఆర్ఎస్ నాయ‌కుడు , విద్యావేత్త వ‌ల్ల‌భ‌నేని శ్రీ‌నివాస‌రావును దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. బండ‌రాళ్ల‌తో మోది పాశ‌వికంగా చంపారు. ఎవ‌రు చంపారు , ఎందుకు చంపారు అనే విష‌యాల‌పై ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులు , క్లూస్ టీం ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

స్థానికంగా విభేదాలే హ‌త్య‌కు కార‌ణ‌మై ఉండ‌వ‌చ్చ‌ని ప‌లువురు భావిస్తున్నారు. గ‌త కొంత కాలంగా స‌న‌త్ న‌గ‌ర్ టీఆర్ఎస్ నాయ‌కుల‌లో చీలిక‌లు వ‌చ్చాయ‌ని, గ్రూపుల వారీగా విడిపోయార‌ని చెబుతున్నారు. ఈ విభేదాలే చినికి చినికి గాలివాన‌లా మారి హ‌త్య‌కు దారి తీశాయా లేక వ్యాపార సంబంధ విషయాలలో తేడా వ‌ల్ల దుండ‌గులు హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. మంత్రి త‌ల‌సాని నియోజ‌క‌వ‌ర్గంలో అందులోనూ అధికార పార్టీ నేత ఇలా హ‌త్య కు గుర‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.