‘గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు’ అందుకున్న పవన్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు”ను అందుకున్నారు. ఈ అవార్డుని ఇండియా, యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (ఇ.ఇ.బి.ఎఫ్‌) ప్రధానం చేసింది. అవార్డు తీసుకోవడానికి ముందు పవన్‌ లండన్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ మెమోరియల్‌ను సందర్శించారు. రేపు (శనివారం) యూరప్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లోని కింగ్స్‌ మెడికల్‌ కళాశాలలో వివిధ యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులతో సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమంతో పవన్ రెండు రోజుల లండన్ పర్యటన పూర్తికానుంది. దీంతో.. పవన్ హైదరాబాద్’కు తిరుగు ప్రయాణం కానుంది.

ఇదిలావుండగా.. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 25వ సినిమా “అజ్ఝాతవాసి” తెరకెక్కనుంది. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ జతకట్టనున్నారు. అనిరుధ్ సంగీతం. రాథాకృష్ణ నిర్మాత. ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ పూర్తి స్థాయిలో పాలిటిక్స్ పై ఫోకస్ చేయనున్నాడు.