17యేళ్ల తర్వాత మిస్ వరల్డ్ కిరీటం

ప్రపంచ సుందరిగా భారతీయ ముద్దుగుమ్మ అవతరించింది. శనివారం చైనాలోని సాన్యా నగరంలో జరిగిన ఫైన‌ల్స్‌లో హర్యానాకు చెందిన 20 ఏళ్ల మానుషి చిల్లర్‌ మిస్ వరల్డ్ కిరీటాన్ని ద‌క్కించుకుంది. 17 ఏళ్ల క్రితం (2000 సంవత్సరంలో) ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత భారతీయ యువతి ప్రపంచ సుందరిగా ఎంపికైంది.

‘మిస్ వరల్డ్ 2017’ పోటీల్లో మొత్తం 108 మందితో తీవ్రమైన పోటీని ఎదుర్కుంది. భారత్ నుంచి 29మంది పోటీలో పాల్గొన్నారు. వీరిలో 20 ఏళ్ల మానుషి చిల్లర్‌ మిస్ వరల్డ్ కిరీటాన్ని ద‌క్కించుకుంది. ద్వితీయ‌, తృతీయ స్థానాల్లో మెక్సికో, ఇంగ్లండ్ యువ‌తులు నిలిచారు. మాజీ విశ్వసుందరి పునెట్రో రికో మిస్ వరల్డ్ కిరిటాన్ని మానుషి చిల్లర్‌ కు ప్రజెంట్ చేసింది.