కోల్’కతా టెస్ట్ : కోహ్లీ సెంచరీ.. టీమిండియా 352/8 డిక్లెర్

ఈడెన్ గార్డెన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా శాసించే స్థితికి చేరుకొంది. కెప్టెన్ కోహ్లీ (103*) సెంచరీ తర్వాత టీమిండియా 352/8 పరుగుల వద్ద తన రెండో ఇన్నింగ్స్ ని డిక్లెర్ చేసింది. దీంతో.. శ్రీలకం ముందు 231పరుగుల ఊరించే టార్గెట్ పెట్టింది. ఊరిస్తూనే విజయం సాధించాలన్నది కోహ్లీ సేన ప్లాన్ లా కనబడుతోంది.

టీ విరామ సమయానికి మరో అరగంట సమయం ఉంది. ఆ తరువాత 105 నిముషాలు ఆట సాగే అవకాశం ఉంది. అయితే, కోహ్లీ ప్లాన్ వర్కవుట్ అయ్యింది. తొలి ఓవర్ లోనే భువనేశ్వర్ శ్రీలంక ఓపెనర్ కనుపదెరని అవుట్ చేశాడు. ఈ టెస్ట్ ఫలితం తేలాంటే అద్భుతం జరగాల్సిందే.