ఆ స‌మాచారం ఇంకా రాలేద‌న్న కేటీఆర్

ఈనెల 28న ప్ర‌ధాన‌మంత్రి మోదీ హైద‌రాబాద్ వ‌స్తున్నారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ ఆ విష‌యంలో క్లారిటీ ఇచ్చారు. మెట్రో రైలు ప్రారంభోత్స‌వానికి ఆయ‌న హైద‌రాబాద్ వ‌స్తార‌ని, 28న ప్ర‌తిష్టాత్మ‌క మెట్రో రైలు కు ఆయ‌న జెండా ఊపేస్తార‌ని మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

అయితే మంత్రి కేటీఆర్ మాత్రం ప్రధాని హైద్రాబాద్ టూర్ షెడ్యూల్ పై అధికారిక సమాచారం ఇంకా రాలేదని , బ‌య‌ట జ‌రుగుతున్న ప్రచారంలో నిజం లేద‌ని తేల్చి చేప్పేశారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ఎలాంటి సమాచారం వచ్చినా వెంటనే విడుదల చేస్తామ‌ని చెప్పార‌ట‌. ఎస్పీజీకి వచ్చిన సమాచారం ప్రకారం ఏర్పాట్లు జరుతున్నాయ‌ని, ఒక‌టి రెండు రోజుల్లో అధికారిక స‌మాచారం వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పారు.