‘అజ్ఝాతవాసి’ ఆడియో వేడుక ఎప్పుడు.. ఎక్కడ ?

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 25వ సినిమాగా “అజ్ఝాతవాసి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘అజ్ఝాతవాసి’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే, ఇప్పుడీ సినిమా ఆడియో వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారమ్. డిసెంబర్ 15న ‘అజ్ఝాతవాసి’ ఆడియో వేడుకని ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అమరావతిలో ఆడియో వేడుక ప్రపోజల్ ని దర్శక-నిర్మాతలు పవన్ ముందు ఉంచడం.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని చెప్పుకొంటున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత త్రివిక్రమ్-పవన్ కలయికలో వస్తోన్న ‘అజ్ఝాతవాసి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్’లు జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్. రాథా కృష్ణ నిర్మాత. ఈ సినిమా తదుపరి షూటింగ్ వారణాసిలో మొదలవ్వనుంది. ఆ తర్వాత చిత్రబృందం అలహాబాద్ వెళ్లనుంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవ్వనుందని చెబుతున్నారు.