అజ్ఝాతవాసి ‘యుఎస్ రైట్స్’ రేటెంతో తెలుసా ?

పవన్-త్రివిక్రమ్ సినిమాకు ఉన్న క్రేజ్ సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. టాలీవుడ్’కు రూ. 100కోట్ల దారిని చూపించిన ఘనత వీరిది. ఇలాంటి వీరి కలయికలో తెరకెక్కుతోన్న ‘అజ్ఝాతవాసి’ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయన్నది చెప్పనక్కర్లేదు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా జరిగుతోంది.

తాజాగా, ‘అజ్ఝాతవాసి’ యుఎస్ రైట్స్’ని బ్లూ స్కై సంస్థ చేజిక్కించుకుంది. ఫ్యాన్సీ రేటు ఆఫ‌ర్ చేసి హ‌క్కుల‌ను పొందిందని చెబుతున్నారు. ఆ రేటు ఎంత ? అనేది మాత్రం బయటపెట్టడం లేదు. ఈ విష‌యాన్ని అధికారికంగా ఆ సంస్థ ప్ర‌క‌టించింది. తమ అభిమాన న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీని త‌మ ద్వారా అమెరికాలో విడుద‌ల కానుండ‌టంతో ఎంతో సంతోషంగా ఉంద‌ని ఆ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.

ఇప్పటికే హైదరాబాద్, యూరప్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది. త్వరలో వారణాసి షెడ్యూల్ మొదలవ్వనుంది. ఆ తర్వాత అలహాబాద్ షెడ్యూల్ ఉండనుంది. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్. రాథా కృష్ణ నిర్మాత. ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.