రాజమౌళి టార్గెట్.. అది !

బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి చేయబోయే సినిమా ఏంటీ ? అనే ఉత్కంఠకు ఇటీవలే తెరపడింది. తారక్-చరణ్’లతో మల్టీస్టారర్ తీయబోతున్నట్టు ఓ ఫోటోతో చెప్పకనే చెప్పాడు జక్కన్న. ఇప్పుడీ మల్టీస్టారర్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటికొస్తున్నాయి. ఈ సినిమా విషయంలో రాజమౌళి రెండు టార్గెట్స్ పెట్టుకొన్నాడని చెబుతున్నారు.

ఇందులో మొదటిది సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ యేడాదిలోపు పూర్తి చేయాలి. 2018 సమ్మర్ లో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లి.. 2019 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలి. గతంలో రాజమౌళి చేసిన మర్యాద రామన్న, ఈగ వంటి సినిమాలకే యేడాదికిపైగా సమయం తీసుకొన్నాడు. మరీ.. స్టార్ హీరోలు తారక్-చరణ్ ల మల్టీస్టారర్ ని యేడాదిలోపు అంటే రాజమౌళికి ఛాలెంజ్ అని చెప్పవచ్చు.

రెండో టార్గెట్.. సినిమాని రూ. 150కోట్ల బడ్జెట్ లోపు తీసేయాలి. ఇద్దరు స్టార్ హీరోలు. రాజమౌళి సినిమా అంటే టెక్నాలజీ వాడకం ఓ రేంజ్ లో ఉండటం ఖాయం. పైగా సినిమా కోసం పనిచేసే తన ఫ్యామిలీ మెంబర్స్ కు రాజమౌళి ఓ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చుకుంటాడనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో రూ. 150కోట్ల బడ్జెట్ లో రాజమౌళి సినిమాని పూర్తి చేయగలడా ? అంటే చేయగలడు. తారక్, చరణ్ లు ఇద్దరు రెమ్యూనరేషన్ కోసం సినిమాలు చేసే రకం కాదు. అందులోనూ రాజమౌళి సినిమా కోసం రెమ్యూనరేషన్ గురించి అస్సలు ఆలోచించరేమో.. !