ఛార్మితో.. ఆ ఇద్దరు దర్శకులు ఎంజాయ్ చేస్తోన్న వీడియో.. వైరల్ !

హీరోయిన్ ఛార్మితో కలిసి ఇద్దరు దర్శకులు ఎంజాయ్ చేస్తోన్న వీడియా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ దర్శకుల్లో ఒకరు పూరి జగన్నాథ్ కాగా, మరొకరు పూరి గురువు, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. దాదాపు 28యేళ్ల తర్వాత వర్మ నాగార్జునతో కలిసి ‘కంపెనీ’ సినిమాని తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఐతే, ఆదివారం సెలవు కావడంతో గురు-శిష్యులు వర్మ-పూరి ఒక చోట చేరారు. వీరితో హీరోయిన్ ఛార్మి కూడా జాయిన్ అయ్యింది.

వీరంతా మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తూ, సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోని ఛార్మి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛార్మితో కలిసి ఇద్దరు హీరోయిన్స్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకొంటున్నారు. ఇక, ప్రస్తుతం పూరి తనయుడు ఆకాష్ తో ‘మెహబూబా’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పూరి మార్క్ ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతోంది.