కీర్తి సురేష్ డబ్బింగ్ కూడా పూర్తి చేసుకొంది

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 25వ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారణాసి షెడ్యూల్ మొదలయింది. మరోవైపు, పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. హీరోయిన్ కీర్తి సురేష్ త‌న పాత్ర‌కి సంబంధించిన డబ్బింగ్’ని కూడా పూర్తి చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే ట్విట్టర్ ద్వారా తెలిపింది. మరో హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ కూడా పవన్ తో పనైపోయిందనే న్యూస్ బయటికొచ్చింది. మరీ.. ఆమె ఈ చిత్రానికి సొంతంగా వాయిస్ అందించడం లేదని తెలుస్తోంది. ఆమె పాత్రకి వాయిస్ ఓవర్ చెప్పించనున్నారు.

పవన్ – త్రివిక్రమ్ కలయికలో రానున్న ‘అజ్ఝాతవాసి’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వారణాసి, అలహాబాద్ షెడ్యూల్స్ తో ‘అజ్ఝాతవాసి’ షూటింగ్ పూర్తి కానుంది. సినిమాని ముందే ప్రకటించినట్టుగా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్. రాథాకృష్ణ నిర్మాత. ఈ సినిమా తర్వాత పవన్ పూర్తిస్థాయిలో పాలిటిక్స్ పై ఫోకస్ చేయబోతున్నట్టు చెబుతున్నారు.