తనయుడి కోసం నాగ్ తగ్గాడు !

ఇండస్ట్రీలో బాలకృష్ణ, నాగార్జునలకి అస్సలు పడని చెబుతుంటారు. నాగ్’కు నిర్మాత దిల్ రాజుతో కూడా విబేధాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్’లో గుసగుసలు వినిపిస్తుంటాయి. నాగ్ తనయుడు నాగ చైతన్య తొలి సినిమా ‘జోష్’ దిల్ రాజు బ్యానర్’లోనే తెరకెక్కింది. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. అవి ఇంకా సమసిపోలేదని చెబుతుంటారు.

ఈ మధ్య దిల్ రాజు బ్యానర్ లో నాగ్ సినిమా రాబోతుందని లీకులొచ్చాయ్. వాటిని వెంటనే నాగ్ ఖండించారు. నితిన్ తో చేయబోతున్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాని మొదట నాగ్ తో చేద్దామని భావించిన దిల్ రాజు.. ఈ మేరకు కావాలనే లీకులిచ్చారు. ఐతే, నాగ్ ఆసక్తి చూపకపోవడంతో.. ‘శ్రీనివాస కళ్యాణం’ నితిన్ హీరోగా పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు.

చివరకు దిల్ రాజు విషయంలో నాగార్జునయే తగ్గినట్టు తెలుస్తోంది. అఖిల్ ‘హలో’ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అదే రోజున దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన నాని “మిడిల్ క్లాస్ అబ్బాయి” (ఎంసిఎ) రిలీజ్ కావాల్సి ఉంది. నాని హవా గురించి తెలిసిందే. స్టార్ హీరోలకు సైతం సాధ్యకానీ లెవల్ లో హిట్స్ కొడుతూ జోరుమీదున్నాడు.

అలాంటి నానితో పోటీ అంటే డ్యామేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో నాగ్ కు తెలుసు. అందుకే నాగ్ తగ్గాడు. దిల్ రాజుని కలిసి నాని ‘ఎంసిఎ’ వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేశాడు. అక్కినేని ఫ్యామిలీలో నాగ్ తో కలిసి ముగ్గురు హీరోలు. సమంత రూపంలో ఓ స్టార్ హీరోయిన్ ఉన్నారు. భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని దిల్ రాజు నాగ్ రిక్వెస్ట్ ని ఓకే చేశారు. ఫలితంగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన నాని ‘ఎంసిఏ ‘ సంక్రాంతికి వెళ్లింది.