హైద‌రాబాద్ కు చేరుకున్న ప్ర‌ధాని

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హైద‌రాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన ఆయ‌న అపాయింట్ మెంట్ ప్ర‌కారం ముందుగా బీజేపీ నేత‌ల‌తో మాట్లాడుతారు. రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి, బ‌లోపేతంపై రాష్ట్ర నేత‌ల‌కు దిశానిర్ధేశం చేయనున్నారు. అనంత‌రం హెలికాప్ట‌ర్ ద్వారా మియాపూర్ మెట్రో స్టేషన్ కు చేరుకుని అక్క‌డ మెట్రో రైలును ప్రారంభిస్తారు. మెట్రో రైలులో ప్ర‌యాణిస్తారు. ఆ త‌రువాత జీఈఎస్ స‌మావేశానికి హాజ‌ర‌వుతారు.. అక్క‌డ స‌మావేశం ముగిసిన త‌రువాత షెడ్యూల్ ప్ర‌కారం కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి తిరిగి ప్ర‌యాణ‌మ‌వుతారు.