మంత్రి హ‌రీష్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంప‌త్ మంత‌నాలు..?

మంత్రి హ‌రీష్ ఎక్క‌డున్నా.. ఏం చేసినా అది హాట్ టాపిక్ గా మారిపోతోంది.. నిన్న మెట్రో ఈవెంట్ లో లేక‌పోవ‌డంపై ఒక్కొక్క‌రు ఒక్కోలా చ‌ర్చించుకున్నారు. ఢిల్లీలో ఉన్న మంత్రి హ‌రీష్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ అవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంప‌త్ మంత్రి హ‌రీష్ రావుతో గంట‌న్న‌ర‌పాటు స‌మావేశ‌మ‌వ‌డం ఏదో ఉందంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది… ఎమ్మెల్యే సంప‌త్ త్వ‌ర‌లోనే టీఆర్ఎస్ గూటికి చేరుకుంటార‌ని, అందుకే మంత్రి హ‌రీష్ రావుతో భేటీ అయ్యారంటూ చెప్పుకుంటున్నారు.

గ‌తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంప‌త్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఓ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో స‌న్నిహితంగా ఉండ‌ట‌మే కాకుండా.. ఆయ‌నతో ప్ర‌త్యేకంగా క‌లవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీఆర్ఎస్ లోకి చేరేందుకే ఆ భేటీ జ‌రిగిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా హ‌రీష్ తో కూడా అందుకే తెర‌వెన‌క మంతనాలు జ‌రుపుతున్నార‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

రేవంత్ కాంగ్రెస్ లో చేరిన త‌రువాత ఆ ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై అధికార పార్టీ గాలం వేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే సంప‌త్ మాత్రం త‌మ భేటీ వెన‌క అలాంటిదేమీ లేద‌ని, క్యాజువ‌ల్ గా మాత్ర‌మే మంత్రి హరీష్ రావును క‌లిసిన‌ట్లు చెబుతున్నారు. చూడాలి మ‌రి ముందు ముందు ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయో..