ఇప్పుడు అను వంతు

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఝాతవాసి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చే యేడాది జనవరి 10న ‘అజ్ఝాతవాసి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వారణాసి జరుగుతోంది. మరోవైపు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.

ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్‌ లు జతకట్టనున్నారు. ఇటీవలే కీర్తి సురేష్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పార్ట్’ని పూరి చేసింది. ఆ విషయాన్ని డబ్బింగ్ చెబుతున్న ఫోటోని తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకొంది. ఇప్పుడు మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్‌ వంతు వచ్చింది.

ప్రస్తుతం అను ‘అజ్ఝాతవాసి’ కోసం డబ్బింగ్ చెబుతోంది. డబ్బింగ్‌ రూమ్‌లో దిగిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన అను.. తొలిసారి డబ్బింగ్‌ చెప్పడం చాలా సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక, అభిమానులతో పంచుకొన్న ఫోటోలో పవన్‌, అను ఉన్నారు. అందులో అను.. పవన్‌పై చేయి వేసి ఆయన్ను ఆటపట్టిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే పవన్‌ మాత్రం మరోవైపు షాకింగ్‌గా చూస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్‌. రాథాకృష్ణ నిర్మాత.