సమంతపై నోరు జారింది.. !

అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్’గా ఎదుగుతోంది యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్. రామ్ ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్. నానితో కలిసి ‘నేను లోకల్’ అనేసింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ టాలీవుడ్’లో రెండు క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. ఇందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఝాతవాసి’ కాగా.. ‘మహానటి’ సావిత్రి బయోపిక్ రెండోవది. అతి తక్కువ కాలంలో ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ తోటీ హీరోయిన్ సమంతపై నోరుజారడంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మహానటి ‘సావిత్రి ‘ బయోపిక్’లో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత మరో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమెది కథని ముందుకు తీసుకెళ్లే జర్నలిస్టు పాత్రని ప్రచారం జరుగుతోంది. ఐతే, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మహానటి సినిమాలో సమంత జమున పాత్రలో నటిస్తోంది. ఆమె అద్భుతంగా నటిస్తుందని నోరు జారింది కీర్తి సురేష్. దీంతో సస్పెన్స్ రిలీవ్ అయినట్టయ్యింది.

‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలీనీ పాండే ‘మహానటి’ బయోపిక్ లో జమున పాత్రలో కనిపించనుంది అన్నారు. ఇప్పుడు జమున సమంత అని తేలిపోయింది. మరీ.. షాలీనీ ఏ పాత్రలో కనిపించనుంది ? అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి… కీర్తి సమంతపై నోరు జారడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది.