ల‌హ‌రి చేతికి మహేష్ సినిమా

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు “భరత్ అను నేను” తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జెడ్-స్వీడుతో చిత్రీకరణ జరుపుకుంటోంది. సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్-కొరటాల కలయికలో వస్తోన్న “భరత్ అను నేను” పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇందులో మహేష్ ఏకంగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ సరసన కైరా అద్వాని జతకట్టనుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ఆడియో హ‌క్కులును ల‌హ‌రి మ్యూజిక్ స్వ‌తం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని ఆఫ‌ర్ చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం దేవిశ్రీ పాటలు ఇచ్చేశారు. అవి ఏ రేంజ్ లో ఉన్నాయన్నది తెలియాలంటే.. ఆడియో బయటికొచ్చే వరకు ఆగాల్సిందే.