భ‌ద్రాద్రి రామ‌య్య ఉత్స‌వాలు..

భ‌ద్రాద్రి రామ‌య్య ఉత్స‌వాల‌కు ముస్తాబ‌వుతున్నాడు. వైకుంఠ ఏకాద‌శి అధ్య‌య‌నోత్స‌వాల‌ను డిసెంబ‌రు 19 నుంచి జ‌న‌వ‌రి 8 వ‌ర‌కు ఈ ఉత్స‌వాలను నిర్వ‌హించ‌నున్నారు. భ‌ద్రాద్రి వైకుంఠ ఏకాద‌శి అధ్య‌య‌నోత్స‌వాల పోస్ట‌ర్ ను స‌చివాల‌యంలో మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ఆవిష్క‌రించారు. డిసెంబ‌ర్ 28న తెప్పోత్స‌వం, 29న ఉత్త‌ర ద్వారంలో దర్శ‌న‌మిచ్చే స్వామివారిని క‌నులారా తిల‌కించేందుకు వ‌చ్చే భ‌క్తుల‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశ‌, విదేశాల నుంచి భ‌క్తులు త‌ర‌లి వ‌స్తార‌ని, వారికి ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంద‌ని మంత్రి వెల్ల‌డించారు