అమీర్ పేట్ మెట్రో స్టేష‌న్ లో బాంబు…?

 

 

మెట్రో ప్రారంభం కావ‌డంతో న‌గ‌ర‌వాసులే కాకుండా వివిధ ప్రాంతాల ప్ర‌జ‌లు మెట్రోలో ఒక్క‌సారి జ‌ర్నీ చేయాల‌ని కోరుకుంటున్నారు. దీంత గ‌త కొద్దిరోజులుగా మెట్రో స్టేష‌న్ల‌న్నీ ప్ర‌యాణీకుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి.. అందులోనూ నిత్యం జ‌నాల‌తో కిట‌కిట‌లాడే అమీర్ పేట్ లో మెట్రో స్టేషన్ ప‌రిస్థితి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇంత క్రేజ్ ఉన్న ఈ మెట్రోకు ప్ర‌స్తుతం సెక్యూరిటీ ప‌రంగా స‌వాల్ ఎదుర‌వుతోంది. స‌రైన భ‌ద్ర‌త లేక‌పోవ‌డంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియ‌ని భ‌యం ఏర్ప‌డుతోంది.

అమీర్ పేట్ మెట్రో స్టేష‌న్ లో బాంబు పెట్టామంటూ పోలీసుల‌కు కాల్ చేశారు ఆగంత‌కులు. స్టేష‌న్ లో ఒక బ్యాగును వ‌దిలి వెళ్లి పోలీసుల‌కు బెదిరింపు కాల్ చేయ‌డంతో త‌నిఖీలు ప్రారంభించారు బాంబ్ స్క్వాడ్. దాదాపు రెండు టీంలు మెట్రో స్టేష‌న్ లో సెర్చింగ్ మొద‌లు పెట్టాయి. ఇంత‌కీ అందులో బాంబు ఉందా.. లేక ఆక‌తాయిలు ఎవ‌రైనా కావాల‌ని కాల్ చేశారా అనే దిశ‌గా కూడా పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. కాల్ ఎక్క‌డ‌నుంచి వచ్చారు.. ఎవ‌రు చేశారు అనేదానిపై కూడా పోలీసులు వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు.