ఓయూలో సూసైడ్ నోట్ వివాదం…!

ఓయూలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థి ముర‌ళి మృతితో యూనివ‌ర్శిటీలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ముర‌ళి సూసైడ్ నోట్ పై హైడ్రామా న‌డుస్తోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న‌ట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్ లో ముర‌ళి చ‌దువుల‌లో ఒత్తిడి త‌ట్టుకోలేక తాను చ‌నిపోతున్న‌ట్లుగా రాసి ఉంది.

అయితే ముర‌ళి చేతి రాత‌కు , సూసైడ్ నోట్ లోని రాత‌కు తేడా ఉంద‌ని విద్యార్థులు ఆందోళ‌నకు దిగారు. మ‌రోవైపు ముర‌ళి త‌న అన్న భాస్క‌ర్ కు చివ‌రి సారిగా లేఖ రాసిన‌ట్లుగా తెలుస్తోంది. అందులో తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని, ఇక నువ్వే ఇంటికి చిన్న‌కొడుకుగా ఉండాల‌ని, అమ్మ‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని రాసిన‌ట్లుగా తెలుస్తోంది.

అస‌లు పోలీసుల వ‌ద్ద ఉన్న‌ది ముర‌ళిరాసిన సూసైడ్ కాద‌ని, విద్యార్థులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. కావాల‌నే పోలీసులు, ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని డైవ‌ర్ట్ చేస్తున్నారంటూ ఆరోపిస్త‌న్నారు. దీంతో ఓయూలో ముర‌ళి సూసైడ్ నోట్ వివాదంగా మారింది.