ఇప్ప‌టికైనా నిరుద్యోగుల‌పై నిర్ల‌క్ష్యం వీడాలి: కోదండ‌రాం

ఓయూలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థి ముర‌ళికి టీజేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం నివాళులు అర్పించారు. ఓయూలో విద్యార్థుల ఆందోళ‌న నేప‌థ్యంలో యూనివ‌ర్శిటీలో పోలీసు బ‌ల‌గాలు మోహ‌రించాయి. నిరుద్యోగ స‌మ‌స్య కార‌ణంగానే విద్యార్థి ముర‌ళి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని తాను భావిస్తున్నాన‌ని కోదండ‌రాం అన్నారు.

మెరిట్ ఉన్న విద్యార్థులు ఇలా ఆత్మహత్యలు చేసుకోవటం బాధాకరమ‌ని, ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా నిరుద్యోగులపై నిర్ల‌క్ష్య వైఖ‌రి విడ‌నాడాల‌ని ఆయ‌న అన్నారు. విద్యార్థులు కోరిన విదంగా నష్ట పరిహారం చెల్లించి చనిపోయిన విద్యార్థికి న్యాయం చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు.