‘అజ్ఝాతవాసి’.. మరో నాలుగు రోజుల్లో.. !

దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ని ‘అజ్ఝాతవాసి’గా చూపించబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న అజ్ఝాతవాసి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పుడీ సినిమా వారణాసి షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది. దీంతో చిత్రబృందం హైదరాబాద్’కు తిరుగు ప్రయాణం అయ్యింది.

మరో నాలుగు రోజుల షూటింగ్’తో సినిమా షూటింగ్ పూర్తికానుంది. మరోవైపు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 80% పనులు పూర్తయ్యాయి. హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయేల్ లు తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పేశారు. త్రివిక్రమ్-పవన్’ల కలయికలో వస్తోన్నచిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్. రాథాకృష్ణ నిర్మాత.