తెలంగాణ‌లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు ఆంక్ష‌లు..!?

ఇరు రాష్ట్రాల్లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. ఏపీలో బుధ‌వారం నుంచి త‌న ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభిస్తున్న ప‌వ‌న్ ముందుగా కృష్ణాన‌దిలో ప‌డ‌వ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తారు. తెలంగాణ‌లో ఉస్మానియా యూనివ‌ర్శిటీలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థి ముర‌ళి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అయితే యూనివ‌ర్శిటీ విద్యార్థి ముర‌ళి కుటుంబాన్ని ప్ర‌త్య‌క్షంగా ప‌రామ‌ర్శించ‌డానికి పోలీస్ ఆంక్ష‌లు అడ్డంకిగా ఉన్నందున ఈ సంద‌ర్బంగా త‌న ప్ర‌గాఢ సానుభూతిని ప్ర‌క‌టించారు. పోలీసుల ఆంక్ష‌లు çలించిన త‌రువాత తాను స్వ‌యంగా వెళ్లి ఆ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

యువ‌తలో రాజ‌కీయ‌ప‌క్షాలు, ప్ర‌భుత్వాలు ఆశ‌లు రేకెత్తించి వాటిని అమ‌లుచేయ‌క‌పోతే వ‌చ్చే దుష్ప‌రిణామాల‌కు ముర‌ళి, వెంక‌టేష్ ల ఆత్మ‌హ‌త్య‌లే నిద‌ర్శ‌న‌మ‌న్నారు ప‌వ‌న్. యువ‌త‌లో నిర్వేదం,నిరాశ క‌ల‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంద‌న్నారు. ఇచ్చిన హామీలు ప్ర‌భుత్వాలు విధిగా అమ‌లు చేయాల‌ని ఆయ‌న అన్నారు. యువ‌త విలువైన త‌మ ప్రాణాలు తీసుకొని త‌ల్లిదండ్రుల‌కు శోకం మిగ‌ల్చ‌వ‌ద్ద‌ని, ఏదైనా పోరాడి సాధించాల‌ని అందుకు జ‌న‌సేన అండ‌గా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు ప‌వ‌న్.