కేసీఆర్.. ఆ మూడు రోజులు అక్క‌డే.. !

సీఎం కేసీఆర్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్ జిల్లాలో ఆయ‌న మూడురోజుల‌పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. బుధ‌వారం సాయంత్రం 4గంట‌ల‌కు హెలికాప్ట‌ర్ లో సీఎం కేసీఆర్ క‌రీనంగ‌ర్ కు చేరుకుంటారు. రాత్రి క‌రీంన‌గ‌ర్ లోనే బ‌స చేస్తారు.

గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో కేసీఆర్‌ ఏరియల్ సర్వే చేస్తారు. అనంత‌రం ప్రాజెక్ట్‌ దగ్గర పనుల పురోగతిపై అధికారులతో కేసీఆర్‌ సమీక్షనిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత రామగుండం బ‌య‌లుదేరి వెళ్లి అక్క‌డ అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వ‌హిస్తారు. మొత్తంమీద సీఎం కేసీఆర్ మూడు రోజులు ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోనే ఆయ‌న ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంద‌ని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి.