క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కేసులో కొత్త ట్విస్టు..!

క్లినికల్ ట్రయల్స్ బాధితుడు భోగ సురేష్ కేసు అనూహ్య మ‌లుపులు తిరిగింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి తప్పించుకున్న‌ సురేష్ బుధవారం పోలీసుల ఎదుట ప్రత్యేక్షమ‌య్యాడు. తానే సిరంజి తో రక్తం తీసుకొని నోటిలో పోసుకొని కక్కుకున్నట్టు మీడియా ముందు సురేష్ చెప్పాడు. చిలివేరీ అశోక్ కుమార్ ను తానూ క్లినికల్ ట్రయల్స్ కు తీసుకు వెళ్లానని వాళ్ళ తల్లి అనడంతో భ‌యపడి అలా చేసానని వెల్లడించారు. సురేష్ వ్యవహారంలో ఫార్మా కంపేనీలపై పలు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మంగళవారం కేంద్ర డ్రగ్స్ అధికారుల విచారణ ఉండడంతో కంపెనీ ప్రతినిధులే సురేష్ ని హాస్పిటల్ నుంచి తప్పించినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు.