ప‌రారీలో పేషంట్..!?

ఇప్ప‌టి వ‌ర‌కు ఖైధీలు ప‌రార‌వ‌డం విన్నాం.. కానీ పేషంట్ ప‌రార‌వ‌డం ఏమిటీ అనుకుంటున్నారా.. ఇది నిజంగా నిజ‌మే.. వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆసుప‌త్రిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఎంజీఎం ఆసుప‌త్రిలో పేషంట్ ప‌రారీ విష‌యం స్థానికంగా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఔష‌ధ ప్ర‌యోగ బాధితుడు సురేశ్ ను గ‌త కొంత కాలం క్రితం వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆసుప‌త్రిలో చేర్చారు. డ్ర‌గ్స్ క‌మిటీ విచార‌ణ నేపథ్యంలో సురేష్ లేక‌పోవ‌డం బృందం కేస్ షీట్ తోనే సరిపెట్టుకుంది.

దీంతో కేస్ షీట్ లో అబ్ స్కాండ్ గా న‌మోదు చేశారు. ఆసుప‌త్రిలోనే ఉన్నాడ‌నుకున్న సురేష్ క‌నిపించ‌క‌పోవ‌డంతో అధికారులు ఈ విష‌యాన్ని క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మయంలో సురేష్ ను హాజ‌రుప‌ర‌చాల్సి రావ‌డంతో విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. సురేష్ ప‌రారీపై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.