వాళ్ల‌లో ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌ను: ప‌వ‌న్

 

విశాఖ ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేనకు కూడా పీఆర్పీ గ‌తే ప‌డుతుంద‌న్న కామెంట్స్ పై ఆయ‌న తీవ్రంగా స్పందించారు. త‌న సోద‌రుడు చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీ ప‌త‌నానికి కార‌ణ‌మెవ‌రో త‌న‌కు తెలుసున‌ని స్ప‌ష్టం చేశారు. దాని వెన‌క ఎవ‌రెవ‌రు ఉన్నారో ప్ర‌తీ ఒక్క‌రూ త‌న‌కు తెలుస‌న్నారు ప‌వ‌న్.

పీఆర్పీని నాశ‌నం చేసిన ప్ర‌తీ ఒక్క‌రినీ తాను గుర్తు పెట్టుకున్నాన‌ని,వాళ్ల‌లో ఎవ్వ‌రినీ వదిలేది లేద‌ని ప‌వ‌న్ విశాఖ వేదిక‌గా హెచ్చ‌రించారు. పీఆర్పీ వినాశ‌నానికి కార‌కులైన వారిలో ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ఒక‌ర‌ని, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న సంగ‌తి చెబుతాన‌ని అన్నారు. రొటీన్ పార్టీల‌లా వెళ్లాలంటే ఎప్పుడో వెళ్లేవాన్న‌ని, జ‌న‌సేన ఒక కొత్త‌ద‌నంతో ముందుకు వెళుతోంద‌ని, అందుకే పార్టీ నిర్మాణం కొంత ఆల‌స్య‌మ‌వుతోంద‌ని అన్నారు. త‌న అన్న‌య్య‌కి ద్రోహం చేసిన వారిని ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌న‌ని స్ప‌ష్టం చేశారు.