పోలవరంలో పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టుని పరిశీలిస్తున్నారు. గత వారం రోజులుగా ఏపీ రాజకీయాలు పోలవరం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ పోలవరం సందర్శించడం ప్రాధాన్యతని సంతరించుకొంది. వాస్తవానికి పవన్ షెడ్యూల్’లో పోలవరం విజిట్ లేదు. పవన్ సడెన్’గా పోలవరం విజిట్ పై నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది.

స్వయంగా అధికారులని అడిగి పోలవరం పనులని తెలుసుకొన్నాడు పవన్. అధికారులు చెప్పిన విషయాలని ఆయన ఓ నోటు చేసుకొన్నారు. వాస్తవికంగా పోలవరం పనులు 2018లోపు పూర్తవుతాయా ? 2019 నుంచి పోలవరం అందుబాటులోకి రానుందా ? అనే విషయాలపై పవన్ ఆరా తీసినట్టు సమాచారమ్. పోలవరంని సందర్శించడం పవన్ ఇదే తొలిసారి. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై స్పందించిన పవన్.. పోలవరంపై ఫోకస్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెబుతున్నారు.

మరోవైపు, పవన్ రాకతో పోలవరం ప్రాంతాలు అభిమానులతో నిండిపోయాయి. ఆ ప్రాంతమంతా పవర్ స్టార్ పవర్ స్టార్ నినాదాలతో మారుమ్రోగిపోతుంది. ఓ దశలో పవన్ అభిమానులని వారించారు. పని మీద వచ్చాను. కాస్త సలైంట్ గా ఉండాలని సూచించారు. పవన్ పోలవరం సందర్శన ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని తర్వాత పవన్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించనున్నారు.