ఇన్నాళ్ల‌కు.. ప‌రిటాల‌తో గొడ‌వ‌పై క్లారిటీ ఇచ్చిన‌ ప‌వ‌న్..!

విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న‌లో ఊహించ‌ని విధంగా ప‌రిటాల అంశాన్ని ప్ర‌స్తావించారు ప‌వ‌న్. తాను తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఎందుకిచ్చానో వివ‌రిస్తూ గ‌తంలో జ‌రిగిన ప్ర‌చారాన్ని ఉద‌హ‌రించారు. గ‌తంలో కొంత‌మంది టీడీపీ నాయ‌కులు కావాల‌నే త‌న‌పై దుష్ప్ర‌చారం చేశార‌ని, అయినా తాను టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని అన్నారు. మ‌న‌సులో పెట్టుకుని ప‌గను పెంచుకోవ‌డం కాద‌ని, అంద‌రి కోసం, ముఖ్యంగా స‌మాజం కోసం అవ‌న్నీ ప‌క్క‌న‌బెట్టాల‌న్నారు.

ప‌రిటాల ర‌వితో త‌న‌కెలాంటి వివాదం త‌లెత్త‌లేద‌ని, తన‌కు గుండు కొట్టించార‌ని కొంద‌రు కావాల‌నే ప్ర‌చారం చేశార‌న్నారు. సినిమాలు తీసి జుట్టు పెర‌గ‌డంతోనే తాను గుండు కొట్టించుకున్నాన‌ని, అంతే త‌ప్ప బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కులాలు ప‌క్క‌న పెట్టి ఐక్యంగా ఉంటేనే ఏపీకి ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధానిగా అమ‌రావ‌తి తయార‌వుతుంద‌న్నారు. మొత్తం మీద ప‌రిటాల‌తో గొడ‌వ‌పై ఇన్నాళ్ల త‌రువాత క్లారిటీ ఇచ్చారు ప‌వ‌న్..