టీఆరెస్ లోకి ఉమామాధవ రెడ్డి…!

టీటీడీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉమా మాధవ రెడ్డి పార్టీ వీడుతున్నారు. ఆమె కుమారుడితో పాటు, తన అనుచరులతో కలిసి టీఆరెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.

ప్రగతి భవన్ లో మంగళవారం ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే తమ మనోగతాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఈ నెల 14న మద్యాహ్నం 12 గంటలకు వారి అనుచరులతో తెలంగాణ భవన్ లో ఉమా మాధవరెడ్డి టీఆరెస్ లో చేరనున్నారు.