పగ తీర్చుకోవడం అంటే.. ఇదే !

ప్రత్యర్థిపై కసిగా పగ తీర్చుకోవడం అంటే ఏంటో టీమిండియా చూపించింది. లంక మూడు వ‌న్డేల సిరీస్’లో భాగంగా జరిగిన తొలి వ‌న్డేలో టీమిండియా ఘోరంగా ఓడింది. ఆ ఓటమి ప్రతికారం తీర్చుకొనేందుకు టీమిండియా ఎంతో సమయం పట్టలేదు. ఈరోజు మొహాలీ వేదికగా జరిగిన రెండో వ‌న్డేలో లంకని కసితీరా ఓడించింది. దీంతో సిరీస్ ని 1-1తో సమం చేసిది.

మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన అద్భుత డబుల్ సెంచరీ.. 208* పరుగులు, ధావ‌న్ 68, అయ్య‌ర్ 88 పరుగులతో 392పరుగుల భారీ స్కోర్ చేసీంది. 393లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 141 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యింది. మాథ్యూస్ (111) అజేయ సెంచ‌రీతో ఒంట‌రిపోరాటం చేశాడు. ఈ నెల 17న విశాఖలో జరగనున్న మూడో వన్ డేతో సిరీస్ ఫలితం తేలనుంది.