ఉమా మాధవరెడ్డి రాజీనామా !

టీడీపీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్’లో చేరబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్’ని కలిసిన ఆమె టీఆర్ఎస్’లో చేరేందుకు నిర్ణయించారు. తాజాగా, ఉమామాధవరెడ్డి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమెతో పాటుగా ఆమె తనయుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు పంపించారు.

రాజీనామా సందర్భంగా ఉమా మాధవరెడ్డి కాస్త ఎమోషన్’కి గురైనట్టు తెలుస్తోంది. “గత్యంతరం లేకే టీడీపీని వీడాల్సి వస్తోంది. ఇన్నాళ్లు తమని పార్టీలో, ప్రభుత్వంలో పదవులిచ్చి ఎంతో గౌరవించారు. దశాబ్దాలుగా టీడీపీతో మా కుటుంబానికి మంచి అనుబంధం. ఐతే, ఇప్పుడు పరిస్థితులు వేరు. వీటిని కార్యకర్తలు, పార్టీ అర్థం చేసుకుంటుంది ఆశిస్తున్నా”నన్నారు.