విరుష్కల హనీమూన్ ఎక్కడో తెలుసా ?

విరాట్ కోహ్లీ-అనుష్క‌శ‌ర్మ‌ల వివాహం ఇటలీలోని టస్కనీ పట్టణంలో జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుకకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఐతే, పెళ్లి తర్వాత ఈ జంట వెంటనే పనిలో పడినట్టు సమాచారమ్. అదేనండీ.. ఈ జంట ప్రస్తుతం హనీమూన్ లో ఉన్నట్టు చెబుతున్నారు. హనీమూన్ కోసం రోమ్ వెళ్లారని టాక్.

గుట్టు చప్పడు కాకుండా పెళ్లి చేసుకొన్న ఈ జంట ఈ నెల 21న ఢిల్లీలో అదిరిపోయే పార్టీ ఇవ్వనుంది. ఆ తర్వాత ఈ నెల 26న ముంబైలో సినీ, క్రికెట్ స్టార్స్ కి ప్రత్యేక విందుని ఏర్పాటు చేయబోతున్నట్టు చెబుతున్నారు. పెళ్లి సెలవుల్లో ఉన్న విరాట్ దొరికిన ఈ సమయాన్ని ప్రేయసి కం భార్య అనుష్క శర్మతో ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ చేసుకొన్నారు.