చరణ్-తారక్.. ముందే పండగ చేసుకొంటున్నారు !

దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే.. ఆ హీరో పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే హిట్ ఖాయం. ఇప్పుడిదే పనిలో ఉన్నారు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్. వీరిద్దరితో రాజమౌళి ఓ మల్టీస్టారర్ సినిమాని ప్లాన్ చేశారు. దీనిపై అధికారిక ప్రకటన రాకున్నా.. సినిమా దాదాపు ఫిక్సయిపోయినట్టేనని చెబుతున్నారు. ఈ ఆనందంలో చరణ్, తారక్ లు ముందే క్రిస్మస్ పండని చేసుకొంటున్నారు.

రామ్ చరణ్ ఇంట్ల్ జరిగిన ప్రీ-క్రిస్మస్ వేడుకలకి తారక్ ఫ్యామిలీ హాజరయ్యింది. వీరితో పాటు యంగ్ హీరో శర్వానంద్, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెండ్డి వంగా తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలని చరణ్ సతీమణి ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. విస్తరాకులతో క్రిస్మస్‌ చెట్టును తయారు చేశానని ఉపాసన తెలిపింది. ఇప్పుడీ ట్వీట్టు, చరణ్-తారక్ కలిసి ఉన్న ఫోటోలని చూసుకొని మెగా అభిమానులు మురిసిపోతున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ ‘రంగస్థలం 198’తో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. సినిమాని వచ్చే యేడాది మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి 151 ‘సైరా నర్సింహారెడ్డి’ నిర్మాణ బాధ్యతలని చూసుకొంటున్నారు. ఇక, ‘జై లవ కుశ’ తర్వాత తారక్ కి కాస్త విశ్రాంతి దొరికింది. వచ్చే యేడాది జనవరి నుంచి త్రివిక్రమ్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు తారక్.