సీఎం సీరియ‌స్ యాక్ష‌న్..!!

శుక్ర‌వారం జ‌రిగిన ఉట్నూరు సంఘ‌ట‌న‌పై సీఎం సీరియ‌స్ అయ్యారు. ఆదివాసులు, లంబాడీల మ‌ధ్య అంత తీవ్ర స్థాయిలో గొడ‌వ జ‌రిగే వ‌ర‌కు స్పందించ‌క‌పోవ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. రెండు వ‌ర్గాల మ‌ధ్య అంత‌రాలు పెరిగేలా జ‌రుగుతున్న పోటాపోటీ ఉద్య‌మాల వ‌ల్ల ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో నెగెటివ్ వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించారు సీఎం.

ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు తెప్పించుకుని అధికారుల నిర్ల‌క్ష్యంపై ఆయ‌న సీరియ‌స్ అయ్యారు. కొమరం భీమ్ జిల్లా యంత్రాంగం పై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. కలెక్టర్,ఎస్పీ పై బదిలీ వేటు వేశారు. అయితే కేవ‌లం జిల్లాకు సంబంధించి యాక్ష‌న్ తీసుకున్న‌ట్లుగా కాకుండా ప‌నిలో పనిగా ప‌లువ‌రు ఐఏఎస్ , ఐపీఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేశారు. అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసేవ‌ర‌కు వెళ్లిందంటే ఇష్యూ తీవ్ర‌త ఏంటో అర్థ‌మ‌వుతోందంటున్నారు ప‌లువురు.. ఏమైనా సీఎం సీరియ‌స్ అయితే ఇలాగే ఉంటుంది మ‌రి.