బయటికొచ్చి చూస్తే.. పవన్ ఫ్యాన్స్ సునామీ !

హైదరాబాద్’లో రెండు బిగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. వీటిలో ఒకటి ముగింపు కాగా, మరోటి ప్రారంభం. ఈ నెల 15 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ సాయంత్రం జరిగే ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి కోవింద్ విచ్చేశారు. మరోవైపు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఝాతవాసి’ ఆడియో వేడుక కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యింది.

హైదరాబాద్ నోవాటెల్’లో ‘అజ్జాతవాసి’ ఆడియో వేడుక ప్రారంభం అయ్యింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో సభా వేదిక నిండిపోయింది. కేకలు, అరుపులతో ఆడియో వేదిక వేడుక మారుమ్రోగిపోతోంది. ఈ ఈవెంట్ ని యాంకర్ సుమ హోస్ట్ చేయబోతోంది. ఇప్పటికైతే.. మెగాస్టార్ ఇంకా ఎవరు రాలేదు. వారికోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, రెండు సాంగ్స్ విపరీతమైన క్రేజ్ వచ్చింది. సినిమాలో మొత్తం ఆరు పాటలున్నాయి. మిగిలిన నాలుగు సాంగ్స్ ని కూడా సంగీత దర్శకుడు అనిరుధ్ లైఫ్ ఫర్ ఫామెన్స్ ఇవ్వబోతున్నాడు. ఈ సాయంత్రం వేదికపై అనిరుధ్ బృందం ప్రాక్టీస్ కూడా చేసింది. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, మెగా యంగ్ హీరోలు, హీరోయిన్స్ కీర్తి సురేష్, అనుఇమ్మాన్యూయేలు ఈ వేడుకకి హాజరు కానున్నారు. సో.. ఎంజాయ్ మెగా ఫ్యాన్స్.