ఇది త్రివిక్రమ్ విసిరిన పవనాస్త్రం.. !

దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ని ‘అజ్ఝాతవాసి’గా చూపించబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘అజ్ఝాతవాసి’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పవన్-త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రమిది. దీంతో ప్రేక్షకులల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ‘అజ్ఝాతవాసి ‘ పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ఈ క్రమంలో రిలీజ్ కి ముందే అజ్ఝాతవాసి రికార్డులని బ్రేక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక, రిలీజ్ తర్వాత అజ్ఝాతవాసి హవా ఏ రేంజ్ లో ఉంటుందనే చూడాలి.

మంగళవారం సాయంత్రం అజ్ఝాతవాసి ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకి విచ్చేసిన ప్రముఖ పాటల రచయిత సిరిమల్లె సీతారామ శాస్త్రి మాట్లాడుతూ.. “త్రివిక్రమ్-పవన్ ల కలయిక గొప్పది. త్రివిక్రమ్ విసిరిన పవనాస్త్రం. త్రివిక్రమ్ విసిరిన కళ్యానాస్త్రం అజ్ఝాతవాసి” అని చెప్పుకొచ్చారు. సినిమా బాగా ఆడాలని మనస్పూర్తిగా ఆశీర్వదించారు.