పవన్ విశ్వరూపం చూస్తారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఝాతవాసి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, అజ్ఝాతవాసి ఎలా ఉండబోతున్నాడు ? ఏం చేయబోతున్నాడు ?? అని తెలుసుకోవాలనే కోరిక ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఆడియో వేడుక వేదికగా ఆ కోరికని తీర్చాడు దర్శకుడు త్రివిక్రమ్. అజ్ఝాతవాసి సినిమా, అందులో నటించిన నటీనటులు, టెక్నీషన్స్ గురించి తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.

‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అందులో కొందరు ఈ స్టేజీపై కూడా ఉన్నారు’ అంటూ పవన్ కళ్యాణ్’ని మహానుభావుడిని చేశాడు త్రివిక్రమ్. ఇక, సినిమాకు పనిచేసిన వారి నుంచి తాను ఏం నేర్చుకొన్నాను అనే విషయాన్ని ఒక్కొక్క మాటలో చెప్పి ఆకట్టుకొన్నాడు. సంగీత దర్శకుడు అనిరుధ్ కి భయమంటే తెలీదు. అది నాకు బాగా నచ్చింది. బోమన్ ఇరానీ నడిచే ఓ ఫిల్మ్ లైబరీ, తనికెళ్ల భరణి నాకు పెద్ద అన్నయ్య, హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయే ల నుంచి క్రమశిక్షణ నేర్చుకొన్నా. ఒక్కరోజు కూడా షూటింగ్ కి ఆలస్యంగా రాలేదు. ఇలా పేరు పేరున ప్రస్తావించి వారిని ఆనందానికి గురిచేశారు.

ఇంకో విశేషమేమింటంటే.. ? త్రివిక్రమ్ సినిమా కథ, ఎలా ఉంటుందని అనే విషయాన్ని ప్రస్తావించలేదు. ఐతే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూస్తారని చెప్పుకొచ్చాడు. ఇదొక్కటే పవన్ అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేసింది. ఆ విశ్వరూపాన్ని చూసేందుకు వచ్చే యేడాది జనవరి 10 వరకు అభిమానులు వెయిట్ చేయక తప్పదు.