చిరంజీవిపై రేవంత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌…!!

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆఫ్ ది రికార్డ్ లో చిట్ చాల్ సంద‌ర్భంల ప‌లు విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌భుత్వ అవినీతి , అక్ర‌మాలపై కీల‌క స‌మాచారాన్ని ఆయ‌న బ‌య‌ట పెట్టారు. అందులో మెగాస్టార్ చిరంజీవికి, ప్ర‌భుత్వానికి మ‌ధ్య తెర వెన‌క జ‌రిగిన విష‌యాలంటూ ఆయ‌న ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. త్వ‌ర‌లోనే త‌న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఆధారాల‌తో స‌హా నిరూపిస్తానంటూ తేల్చి చెప్పారు రేవంత్.

సినిమా వాళ్ళు పేమెంట్ ఆర్టిస్ట్ లని, ఏ పర్పస్ లో డబ్బులు తీసుకుంటారో వారిగురించే పొగుడుతారంటూ తెలుగు మ‌హాస‌భ‌ల్లో మాట్లాడిన సినీ న‌టుల‌పై చుర‌క‌లు వేశారు. తెలుగు సభల్లో సినిమా నటులు సహజ నటుడు కేసీఆర్ ను పొగిడారంటూ కేసీఆర్ ను విమ‌ర్శించారు. గచ్చీబౌలీ లో స‌ర్వే నంబ‌ర్ 83/1 లో ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిని చిరంజీవి తనపేరిట మార్చుకున్నాడు రేవంత్ ఆరోపించారు.

ఆ భూమిని హరీష్ రావు లీజు కు తీసుకొని ఆంధ్రా కాంట్రాక్టర్ తో కన్స్ట్రక్షన్ ప్రారంబిస్తున్నాడని, ఆ భూమి లో పనులకు అనుమతి ఇవ్వనందుకే గ‌తంలో సోమేశ్ కుమార్ ను జిహెచ్ఎంసి కమీషనర్ గా తప్పించారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. దీనికి సంబందించిన ఆధారాలు కూడా త్వరలో బయట పెడతానంటూ ఆయ‌న తేల్చి చెప్పారు. చూడాలి మ‌రి ఈ విష‌యంలో నిజానిజాలేంటో..