@కోదండ‌రాం : ద‌శ‌-దిశ లేని తెలుగు మ‌హాస‌భ‌లు…!?

తెలుగు మహా సభలు అనుకునంతగొప్పగా జరుగలేదని టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం అన్నారు. గతంలో జరిగిన వాటికంటే భిన్నంగాజరుగలేదని, తెలంగాణ ఉద్యమం లో పోరాటం చేసిన వారినిప్రభుత్వంవిస్మరించిందని ఆయ‌న అన్నారు. గద్దర్,విమలక్క,అందే శ్రీ లాంటి వారిని పిలవక పోవడం బాధాకరమ‌న్నారు కోదండ‌రాం.

మరో సారి జరిగే సభలకు ఇప్పుడు ఆహ్వానం అందని వారిని ఆహ్వానిస్తాం అని ప్ర‌భుత్వం అనడంలో ఆంతర్యం ఏంటని ఆయ‌న ప్ర‌శ్నించారు. దశ,దిశ లాంటి వి లేకుండానే తెలుగు మహా సభలు జరిగాయని జేఏసీ భావిస్తుందని స్ప‌ష్టం చేశారు.