ఎమ్మెల్సీ అభ్య‌ర్థిని ఖరారు చేసిన చంద్ర‌బాబు… !

ఏపీలో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఉప ఎన్నికతో ఆ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అభ్య‌ర్థి ఎంపిక‌పై దృష్టి సారించారు. అందులోభాగంగా క‌ర్నూలు జిల్లా నేత‌ల‌తో సోమ‌వారం భేటి అయ్యారు.

ఆశావహులతో విడివిడిగా మాట్లాడారు సీఎం చంద్రబాబు. పార్టీ ఎవరికి టిక్కెట్ కేటాయించినా సహకరించాలని బాబు సూచించారు. అవకాశాలు దక్కని వారికి భవిష్యత్తులో అవకాశాలిస్తామన్న స్పష్టం చేశారు ఏపీ సీఎం. అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ఇప్ప‌టికే సీఎం ఖ‌రారు చేసినా ఇంకా సస్పెన్స్ కొన‌సాగిస్తున్నారు. సాయంత్రం ఈ స‌స్పెన్స్ కు తెర ప‌డ‌నుంది. సాయంత్రం మ‌రోమారు క‌ర్నూలు నేత‌ల‌తో భేటి అయిన త‌రువాత అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ప్ర‌క‌టించ‌నున్నారు సీఎం చంద్ర‌బాబు.