‘అజ్ఝాతవాసి’ అప్పుడే సెన్సార్’కు రెడీ

దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్జాతవాసి”గా చూపించబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న అజ్ఝాతవాసి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పవన్-త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అజ్ఝాతవాసి కోసం ప్రేక్షకులు, ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఐతే, అప్పుడే అజ్ఝాతవాసి సెన్సార్’కు వెళ్లేందుకు రెడీ అయినట్టు సమాచారమ్. సాధారణంగా తెలుగు సినిమాలు రిలీజ్ కి ఒకట్రెండు రోజుల ముందు మాత్రమే సెన్సార్’కు వెళతాయి.

అజ్ఝాతవాసి మాత్రం రెండు వారాల ముందుగానే సెన్సార్’కు వెళ్తుండటం విశేషం. ఇందుకు ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికావడం ఒక కారణమైతే.. సెన్సార్‌ను 2017లో చేయించడం వల్ల అధికారికంగా సినిమా 2017కు చెందినది అవుతుంది అన్నది మరో కారణమని చెబుతున్నారు. సెన్సార్ పూర్తయిన తర్వాత పూర్తిగా ప్రమోషన్స్ పై ఫోకస్ చేసేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సారి ఆయన నుంచి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఎక్స్ పెక్ట్ చేయొచ్చని చెబుతున్నారు.

ఇప్పటికే ‘అజ్ఝాతవాసి’ టీజర్ భయటికొచ్చింది. పాటల పండగ కూడా పూర్తయ్యింది. అయినా.. ‘అజ్ఝాతవాసి’ కథ ఏంటన్నది తెలియరాలేదు. కథ ఏంటని చెప్పకొన్నా.. ఈసారి పవన్ విశ్వరూపం చూస్తాడని త్రివిక్రమ్ చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా టీజర్, సినిమాలో పవన్ పాడిన పాట ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమాన్యూయేల్ లు జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్. రాథాకృష్ణ నిర్మాత.