మ‌రో వివాదంలో జ‌న‌గామ ఎమ్మెల్యే.. !

చెరువు క‌బ్జా అంశంలో వివాదంలో ప‌డిన జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి తాజ‌గా మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. క‌లెక్ట‌ర్ దేవ‌సేన తో వివాదం స‌ద్దుమ‌ణుగుతుండ‌గానే ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడీయాలో చ‌క్క‌ర్లుకొడుతున్నాయి. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

అయితే తాను మాత్రం అలా అన‌లేదంటూ మ‌ళ్లీ వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. రిజ‌ర్వేష‌న్లు తొల‌గించాల‌ని తాను మాట్లాడ‌లేద‌ని, మేధస్సు కలిగినవారు, ఆర్ధికంగా వెనుకబాటుకు గురైన వారికి రిజర్వేషన్లు కల్పిస్తే బాగుంటుందని మాత్ర‌మే అన్నాన‌ని స‌మ‌ర్థించుకున్నారు ఆయ‌న. ఏ కులం గురించి తాను మాట్లాడ‌లేద‌ని, అంబేద్క‌ర్ బ్ర‌హ్మ‌జ్ఞాని అంటూ మాట్లాడారు. ద‌ళిత యువ‌కున్ని జిల్లాప‌రిష‌త్ చైర్మ‌న్ చేశాన‌ని, ద‌ళితుల నుంచి త‌న‌ను దూరం చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌న్నారు. ఎవ‌రైనా అపార్థం చేసుకుంటే క్ష‌మించండ‌ని అన్నారు ఆయ‌న‌.