కోహ్లీ ఆ అనుభవం ఎలా ఉంది ?

అనుష్కశర్మని పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ నన్ను అన్యాయం చేశాడని స్టేట్ మెంట్ ఇచ్చింది హాట్ బ్యూటీ రాఖీ సావంత్. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి… తాను ప్రమోట్ చేస్తున్న కండోమ్ వాడాలని విరాట్’కి పిలుపు ఇచ్చింది. అంతేకాదు.. ఆపై అనుభవం ఎలా వుందో కూడా వివరించమని కోరింది. ఆమె రామ్ దేవ్ బాబాని కూడా తగులుకొంది.

రామ్ దేవ్ బాబా ఇక కండోమ్స్ తయారీ మీద కూడా దృష్టి పెట్టాలని రాఖీ ఉచిత సలహా ఇచ్చింది. త్వరలో రామ్ దేవ్ కండోమ్స్ వాడకం లోకి రావాలని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేసింది. ఇదంతా ఎందుకంటే ? ఇటీవలే కండోమ్స్ ప్రకటనల మీద కేంద్రం కొన్ని షరతులు విధించింది. రాత్రి పది గంటలు దాటాకే ఆ యాడ్స్ ప్లే చేయాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ షరతు పెట్టింది. దీంతో.. ఓ కండోమ్ యాడ్ లో నటించిన రాఖీ సావంత్ కి కోపం వచ్చింది. దీంతో..కోహ్లీ, రామ్ దేవ్ బాబాలని కండోమ్ కి కనెక్ట్ చేసింది. ఇప్పుడీ రాఖీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.